
టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఏప్రిల్ 16వ తేదీ గురువారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 5.30 గంటలకు ధార్మికోపన్యాసం చేయనున్నారు.
ఈ సందర్భంగా ఆయన “నిత్య జీవితంలో ధర్మాచరణం” అనే అంశంపై ధార్మికోపన్యాసం ఇవ్వనున్నారు.
భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందవలసిందిగా టీటీడీ కోరుతోంది.