తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బుధవారం అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరుగనున్నాయి.
ప్రతి ఏడాదీ ఆలయంలో అధ్యయనోత్సవాల సందర్భంగా దివ్యప్రబంధాన్ని పారాయణం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఉదయం ఆలయంలో సేవాకాలం నిర్వహించారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారిని, సేనాధిపతివారిని, ఆళ్వార్లను వేంచేపు చేస్తారు. వారి సమక్షంలో దివ్యప్రబంధాన్ని పారాయణం చేస్తారు. అధ్యయనోత్సవాల్లో భాగంగా జనవరి 20న చిన్నశాత్తుమొర, జనవరి 26న ప్రణయ కలహోత్సవం, జనవరి 30న పెద్దశాత్తుమొర నిర్వహిస్తారు.