కన్నుల పండువగా శ్రీ మలయప్పస్వామివారి తెప్పోత్సవం


తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజు రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామివారు తెప్పలపై భక్తులకు అభయమిచ్చారు.





ముందుగా స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో వైభవంగా ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. రాత్రి 7 గంటల నుండి విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై స్వామివారు ఆశీనులై పుష్కరిణిలో మూడు చుట్లు విహరించారు.





మూడోరోజు...





తెప్పోత్సవాల్లో భాగంగా మూడో రోజు శ‌నివారం సాయంత్రం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌స్వామివారు తెప్పలపై భక్తులను క‌టాక్షించారు.





ముందుగా స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో వైభవంగా ఊరేగింపు నిర్వ‌హించి పుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. రాత్రి 7 గంటల నుండి విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై స్వామి, అమ్మ‌వార్లు ఆశీనులై పుష్కరిణిలో మూడు చుట్లు విహరించారు.









నాలుగోరోజు...





తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలలో భాగంగా నాలుగవ రోజు ఆదివారంనాడు బ్రహ్మాండ నాయకుడైన శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా త‌ప్ప‌పై విహ‌రించి భక్తులకు కనువిందు చేశారు.





ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను శ్రీవారి నాలుగు మాడ వీధుల్లో ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. రాత్రి 7.00 గంటలకు విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీభూ సమేతంగా శ్రీమలయప్పస్వామివారు ఆశీనులై పుష్కరిణిలో ఐదుమార్లు విహరించి భక్తులను క‌టాక్షించారు.





కాగా, చివ‌రి రోజైన సోమ‌వారం శ్రీభూ సమేతంగా మలయప్పస్వామివారు ఏడుచుట్లు పుష్క‌రిణిలో తెప్పపై విహరించి భక్తులను అనుగ్రహిస్తారు.





Source