సాలగ్రామాన్ని పూజిస్తే ఎంత పుణ్యం లభిస్తుందో దాని దానం వలన కూడా అంతటి ఫలం లభిస్తుంది. కార్తీక ద్వాదశి రోజున చేయు సాలగ్రామదానము అనేక పుణ్యప్రదము. సూర్యుడు తులారాశియందుండగా కార్తీకమాసమందు ద్వాదశినాడు ధనికుడు గాని, దరిద్రుడు గాని, యతి గాని, వానప్రస్థుడు గాని , బ్రాహ్మణుడు గాని, క్షత్రియుడు గాని, వైశ్యుడు గాని, శూద్రుడు గాని, స్త్రీగాని సాలగ్రామ దానమాచరించు వారికి జన్మజన్మాంతర కృత పాపములు నశించును.
సాలగ్రామం వున్న ప్రదేశాలలో స్నానం చేసినా, దానం చేసినా, కాశీ క్షేత్రంలో పవిత్ర గంగానదీ స్నానంకంటే, ఆ పుణ్యక్షేత్రంలో చేసిన దానం కంటే, నూరె రెట్లు అధి క ఫలము కలుగుతుంది. సాలగ్రామమును అభిషేకిం చిన పుణ్య బలాలను ప్రోక్షించుకొనినచో, సర్వపాపాల ను నశింపజేస్తుంది. సర్వరోగాలు తొలగిపోతాయి. సక ల సంపదలు కలుగుతాయి, సర్వశుభాలను కలిగించి, మోక్ష సామ్రాజ్యమును సిద్ధింపజేస్తుంది.
2 )పూర్వం విదేహరాజ్యంలో ప్రియంవద అనే స్ర్తీమూర్తి ఉండేది. అత్యంత రూపవతి, గుణవతి అయిన ఆమె, శ్రీమన్నారాయణుని ప్రసన్నం చేసుకుని, ఆయన తన కుమారునిగా జన్మించాలని కోరుకుంటుంది. ఆమె కోరి కను మన్నించిన స్వామివారు, మరుజన్మలో ఆమె గండ కీ నది రూపాన్ని ధరించేటట్లుగా చేసి, తాము సాల గ్రామ రూపంలో ఆ నది నుంచి ఉద్భవిస్తున్నారని కథ.
సాలగ్రామ శిలయందు, చరాచరాత్మకమగు మూడు లోకాలు అణిగి ఉన్నాయి. ఆ కారణంగా సాలగ్రామాన్ని భక్తిశ్రద్ధలతో, పరిపూర్ణ విశ్వాసంతో, శాస్త్ర ప్రకారం అభిషేకిస్తే, కోటి యజ్ఞాలు చేసినంత పుణ్యఫలానికి సమానమవుతుంది. మరియు కోటి గోవులను దానం చేసినంత ఫలితాన్ని పొందుతారు. సాలగ్రామ పూజచే, శివకేశవులని పూజించిన ఫలితం కలుగుతుందిట.
సాలగ్రామం కథ
సాలగ్రామం' సాక్షత్ విష్ణుస్వరూపం. దీనిని అభిషేకించిన పుణ్యజలాన్ని ప్రోక్షించుకుంటే సర్వపాపాలు నశిస్తాయి. సర్వరోగాలు నశించి, సకల సంపదలు లభిస్తాయి. సర్వశుభాలు కలిగి మోక్షప్రాప్తి కలుగుతుందని ఋషివాక్కు. విష్ణుభగవానుడు ‘సాలగ్రామం’ అనే రాయి రుపాన్ని ధరించడం వెనుక అనేక కధలున్నాయి. అందులో ముఖ్యమైనది బృంద కథ. కాలనేమికి జన్మించిన బృంద జలంధరుడు అనే రాక్షసుడిని పెళ్ళాడుతుంది. ఆమె మహాపతివ్రత. కానీ, జలంధరుడు తన రాక్షస ప్రవృత్తిలో అందరిని పీడిస్తుంటాడు. అతను ఎంతవరకు వెళ్ళాడంటే, ఒకానొకప్పుడు శివుని రూపంలో వెళ్ళి పార్వతీదేవిని మోసగించబోతాడు. అందుకు కోపగించిన పార్వతీ దేవి విష్ణువును సమీపించి బృంద పాతివ్రత్యాన్ని భంగపరచమని కోరుతుంది. బృంద పాతివ్రత్య భంగం సకల లోకాలకు అవసరంకూడా. ఎందుకంటే ఆమెకి ఆ భంగం కలిగితేనే జలంధరుని అంతం జరుగుతుంది. సకల లోకాల క్షేమం కోరి విష్ణుభగవానుడు జలంధరుని రూపాన్ని ధరించి బృందని మోసగిస్తాడు. అనంతరం తన నిజరూపాన్ని ప్రకటిస్తాడు. జరిగిన మోసానికి నివ్వెరపోయిన బృంద విష్ణుమూర్తిని శిలగా మారతావని శపిస్తుంది. అలా శ్రీవిష్ణుభగవానుడు సాలగ్రామ రూపాన్ని ధరించాల్సి వచ్చిందని కథ.
సాలగ్రామ శిలలు గండకీనదిలో లభిస్తుంటాయి. ఇవి ఎంత చిన్నవిగా ఉంటే అంత మంచిదని అంటారు. సాలగ్రమంపై ఉన్న చక్రాలను బట్టి వాటిని వివిధ పేర్లతో పిలుస్తుంటారు.
- ఒక చక్రం ఉంటే సుదర్శనమని,
- రెండు చక్రాలు ఉంటే లక్ష్మీనారాయణ అని,
- మూడు చక్రాలు ఉంటే అచ్యుతుడనీ,
- నాలుగు చక్రాలు ఉంటే జనార్ధుడు అనీ,
- ఐదు చక్రాలు ఉంటే వాసుదేవుడనీ,
- ఆరు చక్రాలు ఉంటే ప్రద్యుమ్నుడనీ,
- ఏడు చక్రాలు ఉంటే సంకర్షణుడు అనీ,
- ఎనిమిది చక్రాలు ఉంటే పురుషోత్తముడు అనీ
- తొమ్మిది చక్రలు ఉంటే నవవ్యూహమని
- పది చక్రాలు ఉంటే దశావతారమనీ,
- పదకొండు చక్రాలు ఉంటే అనిరుద్ధుడు అని,
- పన్నెండు చక్రాలు ఉంటే ద్వాదశాత్ముడు అనీ,
- పన్నెండు కంటే ఎక్కువ చక్రాలు ఉంటే అనంతమూర్తి అని పిలుస్తుంటారు.
సాలగ్రామన్ని ఆవుపాలతోగానీ, పంచామృతంతోగానీ శుద్ధి చేసి, రుద్రాక్షధారణ చేసేటప్పుడు చేసే నియమాలతో సాలగ్రామాన్ని పూజించాలి. ఇంట్లో పూజించే సాలగ్రామానికి నిత్యం నైవేద్యం సమర్పించాలి. కుటుంబసభ్యులు తప్ప, మిగతావాళ్ళకి సాలగ్రామన్ని చుపించకూడదు. సాలగ్రామన్ని స్త్రీలు తాకరాదన్న నియమం ఉంది. సాలగ్రామం ఉన్న ప్రదేశంలో స్నానం చేసినా, దానం చేసినా కాశీక్షేత్రంలో చెసిన స్నాన, దానాల కంటే నూరురెట్లు ఫలితం కలుగుతుందనేది ఋషివాక్కు. సాలగ్రామ శిలకు షోడశోపచార పూజ చెస్తే అన్ని కల్పాంతాల వరకు వైకుంఠంలో నివసించే భాగ్యం కలుగుతుంది. సాలగ్రామ పూజ చేస్తే శివకేశవులను పూజించిన ఫలితం కలుగుతుంది. మంత్రాలేమి తెలియక పోయినప్పటికీ భక్తి విశ్వాసాలతో సాలగ్రామం పూజను చెస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. సర్వపాపహరం చేసేది, సర్వకష్టాలనుంచి రక్షించేది సాలగ్రామం.