ఉదయం బ్రేక్ దర్శనానికి రావాలనుకునే ప్రోటోకాల్ విఐపి భక్తులు ఉదయం 8 గంటలకు, సాయంత్రం బ్రేక్ దర్శనానికి రావాలనుకునే భక్తులు మధ్యాహ్నం 3 గంటలకు ఆలయ ఏఈవో కార్యాలయంలో (పీఏసీ సమీపంలో) సూచించిన నమూనా పత్రంతోపాటు ఆధార్ కార్డును జతచేసి అందజేయాల్సి ఉంటుంది. బ్రేక్ దర్శనం టికెట్ ధర రూ.250/-గా నిర్ణయించారు. వీరికి హారతి, తీర్థం, శఠారి ఉంటుంది. కుంకుమార్చన మధ్యాహ్నం 1 గంట నుండి 4.30 గంటల వరకు యథావిధిగా కొనసాగుతుంది.
తిరుచానూరు ఆలయం తెరచు వేళలు
తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయాన్ని ఇకపై అరగంట ముందుగా అనగా ఉదయం 4.30 గంటలకు తెరుస్తారు. రాత్రి 9 గంటలకు బదులు 9.30 గంటలకు మూస్తారు. సాధారణ భక్తులకు దర్శన సమయంలో ఎలాంటి తగ్గింపు లేకుండా ఒక గంట పాటు బ్రేక్ దర్శనాన్ని అమలు చేసేందుకు ఈ మేరకు ఆలయ వేళల్లో మార్పులు చేశారు.
బ్రేక్ దర్శనం, కుంకుమార్చన సేవ తరువాత ప్రోటోకాల్ విఐపిలు రూ.100/- టికెట్ కొనుగోలు చేసి అమ్మవారిని లఘు దర్శనం చేసుకోవచ్చు. సాధారణ భక్తుల సౌకర్యార్థం తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రోటోకాల్ విఐపిలు సహకరించాలని టిటిడి కోరుతోంది.
Source