ప్రముఖ ద్వైత తత్వవేత్త శ్రీశ్రీశ్రీ సుధీంద్ర తీర్థ స్వామీజీ 400వ ఆరాధన మహోత్సవం ఈ నెల 26 ఆదివారం తమిళనాడులోని కుంభకోణంలో ఘనంగా నిర్వహించారు. టీటీడీ తరపున శ్రీవారి వస్త్రాలను అధికారులు సమర్పించారు.
మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర మఠాధిపతి శ్రీశ్రీశ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామీజీ ఈ ఆరాధన మహోత్సవం లో పాల్గొన్నారు.