
ఈ సంవత్సరంలో మొదటిసారి పౌర్ణమి గరుడసేవ కావడం, చిత్రా పౌర్ణమి కావడంతో భక్తులు విశేషంగా విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమాడ వీధులు గోవిందనామ స్మరణతో మార్మోగాయి. ధర్మప్రచారపరిషత్ మరియు అన్నమాచార్యప్రాజెక్టు కళాకారులతో నాలుగుమాడ వీధులలో భజనలు, కోలాటాలు, చెక్క భజనలు కోలాహాలంగా నిర్వహించారు.
Source