నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో మార్చి 20వ తేదీన మత్స్య జయంతి ఘనంగా జరుగనుంది.
శ్రీమహావిష్ణువు వేదాలను రక్షించేందుకు లోకకల్యాణం కోసం మత్స్యావతారంలో స్వయంభువుగా వెలిసిన రోజును మత్స్య జయంతిగా పిలుస్తారు. ఈ రోజున మత్స్యావతార వేదనారాయణస్వామివారిని దర్శించుకున్న భక్తులకు మనశ్శాంతి, నవగ్రహశాంతి, కల్యాణసౌభాగ్యం, భోగభాగ్యాలు కలుగుతాయని ప్రతీతి.
ఈ సందర్భంగా ఉదయం 5 గంటలకు సుప్రభాతంతో స్వామివారి మేల్కొల్పి తోమాల, అర్చన అనంతరం 6.30 నుండి 8.30 గంటల వరకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. ఉదయం 9 నుండి 11.30 గంటల వరకు శాంతిహోమం, స్నపన తిరుమంజనం చేపడతారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 9.30 గంటల వరకు గరుడ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.
Source