శ్రీవారు జన్మించిన శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని నవంబరు 25 శనివారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ”అన్నమయ్య జీవునికొలువు”, ”అన్నమయ్య గీతాసారం” సంకీర్తనలను ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ మునిరత్నంరెడ్డి ఆవిష్కరించారు.
టిటిడి ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ సంకీర్తనలను రికార్డు చేశారు. ”అన్నమయ్య జీవునికొలువు” సంకీర్తనలను శ్రీ బి.రఘునాథ్ స్వరపరిచి గానం చేశారు. ”అన్నమయ్య గీతాసారం” సంకీర్తనలను శ్రీ పిఆర్.రామనాథన్ స్వరపరిచి ఆలపించారు. ఈ సందర్భంగా కళాకారులను శాలువతో సన్మానించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం కళాకారులు ఈ సంకీర్తనలను పాడి వినిపించారు.
ఈ సంకీర్తనలను టిటిడి వెబ్సైట్లో అందుబాటులో ఉంచడమైనది. భక్తులు ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆచార్య కె.జె.కృష్ణమూర్తి ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆచార్య కె.జె.కృష్ణమూర్తి ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.