తిరుమలలో శ్రీమధ్వ విజయం పారాయణం

 

మధ్వ నవమిని పురస్కరించుకుని టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం తిరుమలలోని ఆస్థాన మండపంలో 140 మంది పండితులు శ్రీ మధ్వ విజయం పారాయణం చేశారు.

ఈ సందర్భంగా భువనగిరి శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం మఠాధిపతి శ్రీశ్రీశ్రీ సువిద్యేంద్ర తీర్థ స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు.

స్వామీజీ మాట్లాడుతూ శ్రీ మధ్వాచార్యులు బోధించిన ద్వైత సిద్ధాంతం ద్వారా భక్తే మోక్షానికి మార్గమని చాటి చెప్పారన్నారు. 

కాగా ఈ కార్యక్రమాన్ని దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు పర్యవేక్షించారు.