
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 295వ జయంతి ఉత్సవాలను మే 10, 11వ తేదీల్లో తిరుపతి, తరిగొండలో వైభవంగా నిర్వహిస్తున్నారు.
తిరుపతిలో…
మే 10, 11వ తేదీల్లో తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 10 గంటలకు సాహితి సదస్సు నిర్వహిస్తున్నారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు భక్తి సంగీత కార్యక్రమాలు జరుగుతున్నాయి.
మే 11వ తేది ఉదయం 9 గంటలకు తిరుపతి ఎం.ఆర్.పల్లి సర్కిల్ వద్ద ఉన్న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ విగ్రహానికి పుష్పాంజలి సమర్పించారు.
తరిగొండలో…
మే 11వ తేది తరిగొండ శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, ఆలయ ప్రాంగణంలో శ్రీ తరిగొండ వెంగమాంబకు పుష్పాంజలి, సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో గోష్టి గానం, హరికథ నిర్వహిస్తారు.