మత్స్య జయంతి విశిష్ఠత- సృష్ఠి రక్షణకే మత్స్యావతారం

 

హిందువుల విశ్వాసం ప్రకారం సృష్ఠి ఏర్పడడానికి ఒక కారణం ఉంది. మరియు ప్రతి చెడుకి ఒక మంచి రక్షగా ఉంటుంది. కానీ సృష్ఠి కారణం పూర్తయ్యాక, నాశనం గావించబడుతుంది. మత్స్య పురాణం ప్రకారం విష్ణు భగవానుడు వేదాలను రక్షించడానికి ఒక కొమ్ముల చేప వలె కనిపించాడు. రాబోయే శతాబ్దాల్లో భూమి ఎదుర్కోబోయే గొప్ప మహా ప్రళయాల గురించి హెచ్చరించడానికి విష్ణువు ఈ ప్రత్యేక అవతారంలో భూమిపై కనిపించినట్లు, తద్వారా సమర్ధుడైన మనువుకి ఈ బాధ్యతను అప్పగించినట్లుగా కొన్ని పురాణాల ప్రకారం తెలుస్తోంది. ఈ సంవత్సరం మత్స్య జయంతి మార్చి 24 న అంటే చైత్ర మాసం శుక్ల పక్షంలో మూడవ రోజున జరుపుకుంటారు. 

మత్స్య జయంతి ప్రాముఖ్యత ఇదే...

మత్స్యo తో అనుబంధం ఉన్న కారణాన మత్స్యజయంతి రోజున చెరువులు, సరస్సులు, నదులు మరియు ఇతర నీటి వనరులను శుద్ధి చేయడం ద్వారా అదృష్టం తెచ్చుకోవచ్చని నమ్ముతారు. చేపలు మరియు ఇతర జల జంతువులకు ఆహారమివ్వడం కూడా సాధారణoగా దీక్షలో భాగంగానే ఉంటాయి. ఈ రోజున దాతృత్వంలోని ఏదైనా రూపం ప్రోత్సహించబడుతుంది. అందువల్ల చాలామంది ప్రజలు ఈ రోజున సమాజంలోని పేద మరియు వెనుకబడిన వర్గాలకు ఆహారాన్ని మరియు పాత దుస్తులు విరాళంగా ఇస్తుంటారు. ఈరోజు మత్స్యావ తారo లేదా మత్స్య పురాణాలకు సంబంధించిన కథలు చదవడం వలన కానీ, వినడం వలన కానీ పాప చింతన తొలగి మానసిక ప్రశాంతత లభిస్తుందని హిందువులు విశ్వసిస్తారు.

ఈ రోజు విష్ణుమూర్తికి అంకితం చేయబడిన రోజు, కావున ఆలయంలో ప్రార్ధనలను చేయడం, ఉపవాస దీక్ష గావించడం వంటి వాటి ద్వారా ఆ దేవుని కృపకు పాత్రులవగలరని పురాణాల సారాంశం. ఒకవేళ ఈ ప్రత్యేకమైన రోజు ఉపవాస దీక్షను మరియు పూజలను వేకువ జామునే ఆరంభించగలిగితే, అదృష్టం వరించి మోక్ష మార్గానికి దారి సుగమం అవుతుందని చెప్పబడింది. మోక్షం, హిందూమతం యొక్క అంతిమ లక్ష్యం. అయినప్పటికీ, ఈ ప్రత్యేకమైన ఉపవాస దీక్షలో , పూర్తిగా ఆకలితో ఉండాల్సిన అవసరం కూడా లేదు. పాలు పండ్లు స్వీకరించవచ్చు అని సూచించబడినది.

అవతార కథా విశేషం

మనలో చాలామందికి తెలిసిన కథ ప్రకారం సత్యవ్రతుడు, మనువు మత్స్యాన్ని రక్షించిన వారిలో ఉన్నారు. దీనికి ప్రతిఫలంగా మత్స్యదైవం , మనువుకు ప్రళయాన్ని గురించిన హెచ్చరికలను ముందుగానే తెలియజేస్తుంది. ఈ ప్రళయం కారణంగా సమస్త సృష్టి వినాశనానికి గురవ్వబోతున్నదని, వేదాలను కాపాడవలసిన భాధ్యతను మనువు తీసుకోవలసినది గా దేవ మత్స్యం సూచిస్తుంది. మరియు అన్ని మొక్కలకు సంబంధించిన విత్తనాలను, ఆరోగ్యకరమైన జంటలను కూడా కాపాడవలసినదిగా మనువు ఆదేశింపబడుతాడు. ఈ హెచ్చరికల కారణంగానే ఒక భయానకమైన ప్రళయం నుండి మనువు అనేకమందిని కాపాడగలిగాడు. తద్వారా మానవాళి ఉనికి ప్రశ్నార్ధకం కాకుండా చేయగలిగాడని పురాణాల సారాంశం.

మత్స్య దేవాలయం

ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి ఆలయ పట్టణ సమీపంలో నాగలాపురంలో ప్రసిద్ధమైన, శ్రీమహావిష్ణువు మత్స్యావతారానికి అంకితమిచ్చిన శ్రీ వేద నారాయణస్వామి ఆలయం ఉంది. ముందు చెప్పినట్లుగా, మత్స్య పురాణాల్లో వివరించబడిన నిర్మాణ వివరాలు చాలా ఖచ్చితమైనవి. ఈ ఆలయ రూపకల్పన, ఇంకా సృష్టిలో ఇదే వాడబడింది. ప్రతి సంవత్సరం, సూర్యుని కిరణాలు నేరుగా మార్చి 25 , 26 మరియు 27 వ తేదీల్లో విగ్రహం మీద పడేలా ఉండడం ఈ దేవాలయం ప్రత్యేకత. ఈ సమయంలో వేద నారాయణ స్వామి శ్రీదేవి భూదేవి సమేతుడై భక్తులకు కనువిందు చేస్తాడు.