ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల విడుదల వాయిదా

పరిపాలనా కారణాల వల్ల డిసెంబర్ 29, 30 మరియు 31  (వైకుంఠ ద్వార దర్శనం) తేదీలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం   మరియు శ్రీవాణి బ్రేక్ దర్శనాలకు సంబంధించిన టిక్కెట్లు పరిపాలనా కారణాల వలన విడుదల చేయబడవు.

ఈ టిక్కెట్ల విడుదలకు సంబంధించిన సవరించిన షెడ్యూల్‌ను త్వరలో టీటీడీ విడిగా ప్రకటిస్తుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరడమైనది.