ఆచమనం
ఓం కేశవాయ స్వాహాః, నారాయణాయ స్వాహాః మాధవాయ స్వాహాః(అని మూడుసార్లు చేతిలో నీరు వేసుకొని త్రాగవలెను)గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః
హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్త మాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః
గణపతి ప్రార్థన
(గణపతికి నమస్కరించి ఈ క్రింది శ్లోకములు చదువ వలెను).
యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా తయోస్సంస్మరణాత్పుంసాంసర్వతో జయ మంగళం.
లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ: ఏషామిందీవరశ్శ్యామో హృదయస్థోజనార్థన.
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయోనమామ్యహం.
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే
శరణ్యేత్య్రంబికే దేవి నారాయణి నమోస్తుతే.
ఈ క్రింది మంత్రమును చెపుతూ కుడి చేతితో అక్షంతలు
దేవునిపై చల్లవలెను
- ఓం శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః,
- ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః,
- ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః,
- ఓం శచీపురందరాభ్యాం నమః,
- ఓం అరుంధతీ వశిష్టాభ్యాం నమః,
- ఓం శ్రీ సీతారామాభ్యాం నమః,
- నమస్సర్వేభ్యో మహాజనేభ్యః,
- అయం ముహూర్త స్సుముహూర్తోస్తు
భూతోచ్చాటన
(క్రింది విధముగా చదువుతూ అక్షతలు వెనుక వేసుకొనవలెను.)
శ్లో: ఉత్తిష్టంతు భూతపిశాచా: ఏతే భూమి భారకా: ఏతాషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే
ప్రాణాయామం
(మూడు సార్లు లోపలికి గాలి పీల్చి నెమ్మదిగా వదలడం)
ఓం భూః, ఓం భువః, ఓగ్ సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగ్ సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్...
ఓమా పోజ్యోతీరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్....
అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోపినా
యః స్మరేత్పుండరీకాక్షంస బాహ్యాభ్యంతరశ్శుచిః
(అని నాలుగు దిక్కులా ఉద్ధరణితో నీళ్ళు చల్లవలెను. శుద్ధి చేసినట్టుగా)
సంకల్పము
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభేశోభనే ముహూర్తే, శ్రీ మహావిష్ణోరాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ: ద్వితీయపరార్ధే, శ్వేత వరాహకల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రధమపాదే, జంబూ ద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోర్ధక్షిణదిగ్భాగే, ...........నదీ సమీపే.........(శ్రీశైలస్య.........ప్రదేశే) వసతి/స్వ గృహే, అస్మిన్ వర్తమాన వ్యావహారిక, చాంద్రమానేన శ్రీవిళంబి నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్ష ఋతౌ, భాద్రపద మాసే, శుక్ల పక్షే, చతుర్థ్యాం, ------ వాసరే, శుభ నక్షత్రే, శుభయోగే శుభకరణే, ఏవంగుణ విశేషణ విశిష్టాయాం , శుభతిధౌ శ్రీమాన్...............గోత్ర:..............నామధేయ: ధర్మపత్నీ........... సమేతోహం సకుటుంబస్య క్షేమస్ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్ధం, ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ద్యర్ధం, పుత్ర పౌత్రాభివృద్ధ్యర్ధం సకలకార్యేషు సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్ధం, శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ముద్ధిస్య శ్రీ వరసిద్ధి వినాయక దేవతాపూజాం కరిష్యే...., అదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్ధం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. (నీరు ముట్టుకొనవలెను)
భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణమ్
విఘ్నాంధ కార భాస్వంతం విఘ్నరాజ మహంభజే...
ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవమ్ ధ్యాయేత్సిద్ధి వినాయకమ్...
ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం
షోడశోపచారపూజ
ధ్యాయేద్గజాననం దేవం తప్తకాంచన సన్నిభం,
చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం,
మహా గణాధిపతయే నమః ధ్యాయామి
అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర
అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భసముద్భవ||
మహా గణాధిపతయే నమః ఆవాహయామి
మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం
రత్నసింహాసనంచారు ప్రీత్యర్థం ప్రతి గృహ్యాతాం||
ఆసనం సమర్పయామి
గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన
గృహాణార్ఘ్యం మయాదత్తం గంధ పుష్పాక్షతైర్యుతం||
ఆర్ఘ్యం సమర్పయామి
గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్ట ప్రదాయక
భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన||
పాద్యం సమర్పయామి
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత
గృహాణాచమనం దేవ, తుభ్యం దత్తంమయా ప్రభో||
ఆచమనీయం సమర్పయామి.
దధిక్షీర సమాయుక్తం థామద్వాజ్యేన సమన్వితం
మధుపర్కం గృహాణేదం గజవక్త్రం నమోస్తుతే||
మధుపర్కం సమర్పయామి.
స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత||
పంచామృత స్నానం సమర్పయామి.
గంగాదిసర్వతీర్థేభ్యః ఆహృతైరమలిర్జలైః
స్నానం కురుష్వభగవానుమాపుత్ర నమోస్తుతే||
శుద్ధోదక స్నానం సమర్పయామి.
రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యంచ మంగళం
శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ||
వస్త్ర్రయుగ్మం సమర్పయామి.
రాజితం బహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం
గృహాణ సర్వదేవజ్ఞ భక్తానామిష్టదాయక||
ఉపవీతం సమర్పయామి.
చంద నాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం
విలేపనం సురశ్రేష్ట ప్రీత్యర్థం ప్రతిగృహ్యాతాం||
గంధాన్ సమర్పయామి.
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాంస్తండులాన్ శుభాన్,
గృహాణ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే||
అక్షతాన్ సమర్పయామి.
సుగంధాని సుపుష్పాణి జాజీకుంద ముఖానిచ
ఏక వింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే||
పుష్పాణి పూజయామి.
అథాంగ పూజ
(విఘ్నేశ్వరుని పుష్పములతో పూజించవలెను)
- ఏకదంతాయ నమః - గుల్భౌపూజయామి
- శూర్పకర్ణాయ నమః - జానునీ పూజయామి
- విఘ్నరాజాయ నమః - జంఘే పూజయామి
- అఖువాహనాయ నమః - ఊరూ పూజయామి
- హేరంబాయ నమః - కటిం పూజయామి
- లంబోదరాయ నమః - ఉదరం పూజయామి
- గణనాథాయ నమః - నాభిం పూజయామి
- గణేశాయ నమః - హృదయం పూజయామి
- ఓం స్థూలకంఠాయ నమః - కంఠం పూజయామి
- గజవక్త్రాయ నమః - వక్త్రం పూజయామి
- విఘ్నహంత్రే నమః - నేత్రం పూజయామి
- శూర్పకర్ణాయ నమః - కర్ణౌ పూజయామి
- ఫాలచంద్రాయ నమః - లలాటం పూజయామి
- సర్వేశ్వరాయ నమః - శిరః పూజయామి
- విఘ్నరాజాయ నమః - సర్వాణ్యంగాని పూజయామి
ఏకవింశతి పత్రపూజ
(21 విధముల పత్రములతో పూజింపవలెను)
- సుముఖాయనమః - మాచీపత్రం పూజయామి
- గణాధిపాయ నమః - బృహతీపత్రం పూజయామి
- ఉమాపుత్రాయ నమః - బిల్వపత్రం పూజయామి
- గజాననాయ నమః - దుర్వాయుగ్మం పూజయామి హరసూనవేనమః - దత్తూరపత్రం పూజయామి
- లంబోదరాయనమః - బదరీపత్రం పూజయామి
- గుహాగ్రజాయనమః - అపామార్గపత్రం పూజయామి
- గజకర్ణాయనమః - తులసీపత్రం పూజయామి
- ఏకదంతాయ నమః - చూతపత్రం పూజయామి
- వికటాయ నమః - కరవీరపత్రం పూజయామి
- భిన్నదంతాయ నమః - విష్ణుక్రాంతపత్రం పూజయామి
- వటవేనమః - దాడిమీపత్రం పూజయామి
- సర్వేశ్వరాయనమః - దేవదారుపత్రం పూజయామి
- ఫాలచంద్రాయ నమః - మరువకపత్రం పూజయామి
- హేరంబాయనమః - సింధువారపత్రం పూజయామి
- శూర్పకర్ణాయనమః - జాజీపత్రం పూజయామి
- సురాగ్రజాయనమః - గండకీపత్రం పూజయామి
- ఇభవక్త్రాయనమః - శమీపత్రం పూజయామి
- వినాయకాయ నమః - అశ్వత్థపత్రం పూజయామి
- సురసేవితాయ నమః - అర్జునపత్రం పూజయామి
- కపిలాయ నమః - అర్కపత్రం పూజయామి
- శ్రీ గణేశ్వరాయనమః - ఏకవింశతి పత్రాణి పూజయామి.
శ్రీ వినాయక అష్టోత్తర శత నామ పూజా
- ఓం గజాననాయ నమః-1 ఓం గణాధ్యక్షాయ నమః-2
- ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః
- ఓం ద్వైమాతురాయ నమః ఓం ద్విముఖాయ నమః
- ఓం ప్రముఖాయ నమః ఓం సుముఖాయ నమః
- ఓం కృతినే నమః ఓం సుప్రదీప్తాయ నమః
- ఓం సుఖనిధయే నమః ఓం సురాధ్యక్షాయ నమః
- ఓం సురారిఘ్నాయ నమః ఓం మహాగణపతయేనమః
- ఓం మాన్యాయ నమః ఓం మహాకాలాయ నమః
- ఓం మహాబలాయ నమః ఓం హేరంబాయ నమః
- ఓం లంబజఠరాయ నమః ఓం హయగ్రీవాయ నమః-20
- ఓం ప్రథమాయ నమః ఓం ప్రాజ్ఞాయ నమః
- ఓం ప్రమోదాయ నమః ఓం మోదకప్రియాయ నమః
- ఓం విఘ్నకర్త్రే నమః ఓం విఘ్నహంత్రే నమః
- ఓం విశ్వనేత్రే నమః ఓం విరాట్పతయే నమః
- ఓం శ్రీపతయే నమః ఓం వాక్పతయే నమః
- ఓం శృంగారిణే నమః ఓం ఆశ్రితవత్సలాయ నమః
- ఓం శివప్రియాయ నమః ఓం శీఘ్రకారిణే నమః
- ఓం శాశ్వతాయ నమః ఓం బలాన్వితాయ నమః
- ఓం బలోద్ధతాయ నమః ఓం భక్తనిధయే నమః
- ఓం భావగమ్యాయ నమః ఓం భావాత్మజాయ నమః-40
- ఓం అగ్రగామినే నమః ఓం మంత్రకృతే నమః
- ఓం చామీకర ప్రభాయ నమః ఓం సర్వాయ నమః
- ఓం సర్వోపస్యాయ నమః ఓం సర్వకర్త్రే నమః
- ఓం సర్వ నేత్రే నమః ఓం నర్వసిద్ధిప్రదాయ నమః
- ఓం సర్వసిద్ధయే నమః ఓం పంచహస్తాయ నమః
- ఓం పార్వతీనందనాయ నమః ఓం ప్రభవే నమః
- ఓం కుమార గురవే నమః ఓంకుంజరాసురభంజనాయ నమః
- ఓం కాంతిమతే నమః ఓం ధృతిమతే నమః
- ఓం కామినే నమః ఓం కపిత్థఫలప్రియాయ నమః
- ఓం బ్రహ్మచారిణే నమః ఓం బ్రహ్మరూపిణే నమః-60
- ఓం మహోదరాయ నమః ఓం మదోత్కటాయ నమః
- ఓం మహావీరాయ నమః ఓం మంత్రిణే నమః
- ఓం మంగళసుస్వరాయ నమః ఓం ప్రమదాయ నమః
- ఓం జ్యాయసే నమః ఓం యక్షికిన్నరసేవితాయ నమః
- ఓం గంగాసుతాయ నమః ఓం గణాధీశాయ నమః
- ఓం గంభీరనినదాయ నమః ఓం వటవే నమః
- ఓం పరస్మై నమః ఓం జ్యోతిషే నమః
- ఓం అక్రాంతపదచిత్ప్రభవే నమః ఓం అభీష్టవరదాయ నమః
- ఓం మంగళప్రదాయ నమః ఓం అవ్యక్త రూపాయ నమః
- ఓం పురాణపురుషాయ నమః ఓం పూష్ణే నమః-80
- ఓంపుష్కరోత్క్షిప్తహరణాయనమః ఓం అగ్రగణ్యాయ నమః
- ఓం అగ్రపూజ్యాయ నమః ఓం అపాకృతపరాక్రమాయ నమః
- ఓం సత్యధర్మిణే నమః ఓం సఖ్యై నమః
- ఓం సారాయ నమః ఓం సరసాంబునిధయే నమః
- ఓం మహేశాయ నమః ఓం విశదాంగాయ నమః
- ఓంమణికింకిణీ మేఖలాయనమః
- ఓం సమస్తదేవతామూర్తయేనమః
- ఓం సహిష్ణవే నమః ఓం బ్రహ్మవిద్యాది దానభువేనమః
- ఓం జిష్ణువే నమః ఓం విష్ణుప్రియాయ నమః
- ఓం భక్తజీవితాయ నమః ఓం జితమన్మధాయ నమ:
- ఓం ఐశ్వర్యకారణాయ నమః ఓం సతతోత్థితాయ నమః-100
- ఓం విష్వగ్దృశేనమః ఓం విశ్వరక్షావిధానకృతే నమః
- ఓం కళ్యాణగురవే నమః ఓం ఉన్మత్తవేషాయ నమః
- ఓం పరజయినే నమః ఓం సమస్త జగదాధారాయ నమః
- ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః
ధూపం
అగజానన పద్మార్కం గజాననమహర్నిశమ్
అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే
దశాంగం గుగ్గులోపేతం సుగంధం, సుమనోహరం,
ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదోభవ| ధూపమాఘ్రాపయామి.
దీపం
సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినా యోజితం మయా,
గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే| దీపందర్శయామి.
నైవేద్యం
సుగంధాసుకృతాంశ్చైవమోదకాన్ ఘృతపాచితాన్,
నైవేద్యం గృహ్యతాంచణముద్దేః ప్రకల్పితాన్,
భక్ష్యం చ లేహ్యంచ చోష్యం పానీయమేవచ,
ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక|
నైవేద్యం సమర్పయామి.
సచ్చిదానంద విఘ్నేశ పుష్కలాని ధనానిచ,
భూమ్యాం స్థితాని భగవాన్ స్వీకురుష్వ వినాయక|
సువర్ణపుష్పం సమర్పయామి.
తాంబూలం
పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం,
కర్పూర చూర్ణసంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం|
తాంబూలం సమర్పయామి|
నీరాజనం
ఘృతవర్తి సహస్రైశ్చ శకలైస్థితం నీరాజనంమయాదత్తం
గృహాణవరదోభవ| నీరాజనం సమర్పయామి.
అథ దూర్వాయుగ్మ పూజా
- గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి|
- ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి|
- ఆఖువాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి|
- వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి|
- ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి|
- సర్వసిద్ధి ప్రదాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి|
- ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం పూజయామి |
- ఇభవక్త్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి |
- మూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి |
- కుమారగురవే నమః దూర్వాయుగ్మం పూజయామి |
- ఏకదంతైకవదన తథామూషిక వాహనాయనమః దూర్వాయుగ్మం పూజయామి |
కుమారగురవే తుభ్యం అర్పయామి సుమాంజలిం
మంత్రపుష్పం సమర్పయామి |
నమస్కార ప్రార్థన
ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ
నమస్తే విఘ్ననాశన,
ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి,
అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వ భద్ర ప్రదాయక
గంధ పుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశన,
పునరర్ఘ్యం సమర్పయామి,
ఓం బ్రహ్మవినాయకాయ నమః
నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన,
ఈప్సితంమే వరం దేహి వరత్రచ పరాంగతిమ్ |
వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా ||
శ్రీ వినాయక వ్రత కథ
గణపతి జననము
సూతమహర్షి శౌనకాది మునులకు ఇట్లు చెప్పెను. గజముఖుడయిన అసురుడొకడు తన తపస్సుచే శంకరుని మెప్పించి కోరరాని వరము కోరినాడు. తనను ఎవరూ వధించజాలని శక్తిని, శివుడు తన ఉదరమునందే నివసించవలెనని కోరినాడు. ఆ ప్రకారము శివుడు అతడి కుక్షియందు బందీ అయినాడు, అతడు అజేయుడైనాడు.
భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీ దేవికి చాలా దుఃఖహేతువైనది, జగత్తుకు శంకరుడు లేనిస్థితియది, జగన్మాతయగు పార్వతి భర్తను విడిపించు ఉపాయమునకై విష్ణువును ప్రార్థించినది, విష్ణువు గంగిరెద్దువాని వేషము ధరించినాడు. నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకొని వెళ్లినాడు. గంగిరెద్దునాడించి గజముఖాసురుని మెప్పించినాడు గజముఖాసురుడు ఆనందంతో ‘’ఏమి కావలయునో కోరుకో’’ అన్నాడు, విష్ణుదేవుని వ్యూహము ఫలించినది, నీ ఉదరమందున్న శివుని కొరకై ఈ నందీశ్వరుడు వచ్చినాడు, శివుని నందీశ్వరుని వశము చేయుమన్నాడు. గజముఖాసురునికి శ్రీహరి వ్యూహమర్థమయింది. తనకు అంత్యకాలము దాపురించి నదని గుర్తించాడు.
అయినా మాట తప్పుట కుదరదు కనుక కుక్షియందున్న శివుని ఉద్దేశించి ‘’ప్రభూ శ్రీహరి ప్రభావమున నా జీవితము ముగియుచున్నది... నా యనంతరం నా శిరస్సు త్రిలోకపూజితమగునట్లు, నా చర్మమును నిరంతరము నీవు ధరించునట్లు అనుగ్రహించవలసింది’’ అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వశము చేశాడు. నందీశ్వరుడు గజముఖాసురుని యుదరమును చీల్చి శివునికి అందుండి విముక్తి కలిగించాడు. శివుడు గజముఖాసురుని శిరమును, చర్మమును తీసుకొని స్వస్థానోన్ముఖుడైనాడు.
అక్కడ పార్వతి భర్త రాకను గురించిన వార్త విని పరమానందముతో భర్తకు స్వాగతము పలుకుటకై సంసిద్ధమవుతూ, స్నానాలంకారముల ప్రయత్నములో తనకై ఉంచిన నలుగుపిండితో ఒక బాలుడి ప్రతిమను చేసి ప్రాణప్రతిష్ఠ చేసి ఆ దివ్యసుందర బాలుని వాకిట కాపలాగా ఉంచి, తన పనులకై లోనికి వెళ్ళింది. శివుడు తిరిగి వచ్చాడు, వాకిట ఉన్న బాలుడు అతనిని అభ్యంతర మందిరము లోనికి పోనివ్వక నిలువరించినాడు. తన మందిరమున తనకే అటకాయింపా! శివుడు రౌద్రముతో ఆ బాలుని శిరచ్ఛేదము చేసి లోనికేగినాడు.
జరిగిన దానిని విని పార్వతి విలపించింది. శివుడు చింతించి వెంటనే తన వద్దనున్న గజముఖాసురుని శిరమును ఆ బాలుని మొండెమునకు అతికి ఆ శిరమునకు శాశ్వతత్వమును, త్రిలోకపూజనీయతను కలిగించినాడు. గణేశుడు గజాననుడై శివపార్వతుల ముద్దులపట్టియైనాడు. విగతజీవుడైన గజముఖాసురుడు అనింద్యుడై మూషిక రూపమున వినాయకుని వాహనమై శాశ్వతస్థానమును పొందాడు.
గణేశుడు అగ్రపూజ్యుడు
ఆది దేవుడు విఘ్నేశ్వరుడు. ఈ గజాననునికి ఆ స్థానము ఎలా కలిగిందంటే...శివుని రెండవ కుమారుడైన కుమారస్వామి తనకు ఆ స్థానమును కోరినాడు. శివుడు ఇరువురికీ పోటీ పెట్టినాడు. ‘’మీలో ఎవరు ముల్లోకములలోని పవిత్రనదీ స్నానాలు చేసి ముందుగా నావద్దకు వచ్చెదరో వారికి ఈ ఆధిపత్యము లభిస్తుందన్నాడు? కుమారస్వామి వేగముగా సులువుగా సాగి వెళ్ళినాడు. గజాననుడు త్రిలోకముల పవిత్ర నదీ స్నాన ఫలదాయకమగు ఉపాయమును తల్లిదండ్రులను అర్థించినాడు. వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన పరమశివుడు అట్టి ఫలదాయకమగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు. నారములు అనగా జలములు, జలమున్నియు నారాయణుని ఆధీనాలు. అనగా ఆ మంత్ర ఆధీనములు, మంత్ర ప్రభావము చేత ప్రతీ తీర్థస్నానమందును కుమార స్వామి కన్నాముందే వినాయకుడు ప్రత్యక్షము కాజొచ్చాడు. దీంతో వినాయకునికే ఆధిపత్యము లభించినది.
చంద్రుని పరిహాసం
గణేశుడు జ్ఞానస్వరూపి, అగ్రపూజ్యుడు, జగద్వంద్యుడూ. ఈ విషయమును విస్మరించిన చంద్రుడు వినాయకుని వింతరూపమునకు విరగబడి నవ్వాడు. (చంద్రుడు మనస్సుకు సంకేతము) ఫలితముగా ఆతని మాన్యత నశించింది. నింద్యుడయినాడు. ఆతడిపట్ల లోకము విముఖత వహించాలి. అనగా అతనిని చూడరాదు చూచిన యెడల అజ్ఞానముతో నింద్యుడయినట్లే, లోకులు కూడా అజ్ఞానులు, నింద్యులు అవుతారు. నిందలకు గురియగుతారు.
చంద్రునికి కలిగిన శాపము లోకమునకు కూడా శాపమైనది. లోకులు చంద్రుని చూడకుండుటెట్లు? నీలాపనిందల మధ్య సవ్యముగా సాగుట ఎట్లు? చంద్రుడు జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపము చెందాడు. లోకులను ఈ శాపము నుండి విముక్తికై గణపతిదేవుని అర్థించినారు. కరుణామయుడగు ఆ దేవుడు విముక్తికై ఉపాయము సూచించినాడు. భాద్రపద శుద్ధ చవితినాడు తన పూజచేసి తన కథను చెప్పుకొని అక్షతలు శిరమున ధరించిన యెడల నిష్కళంక జీవితములు సాధ్యమగునని అనుగ్రహించినాడు.
ఇది ఎల్లరికి విధియని వక్కాణించబడినది. దీనిలో ఏమరుపాటు ఎంతటివారికి అయినా తగదని శ్యమంతకమణ్యుపాఖ్యానము ద్వారా మరింత స్పష్టము చేయబడినది.
శ్యమంతకోపాఖ్యానము
చంద్రదర్శనం నీలాపనింద: ఒకానొక వినాయక చతుర్థి సందర్భమున శ్రీ కృష్ణపరమాత్మ పాలలో చంద్ర బింబమును చూచుట సంభవించినది. దాని ఫలితము ఆయనకూ తప్పలేదు. సత్రాజిత్తు అను నాతడు సూర్యోపాసనచే శ్యమంతకమను మణిని సంపాదించినాడు. దినమునకు ఎనిమిది బారువుల బంగారము నీయగల మణియది. అంతటి శక్తివంతమైన మణి పరిపాలకుని వద్ద ఉండదగినదని ధర్మజ్ఞుడగు శ్రీకృష్ణుడు భావించినాడు. ఆ విషయము సత్రాజిత్తునకు సూచించినాడు. అతనికి ఆ సూచన రుచించలేదు.
అనంతరము సత్రాజిత్తు తమ్ముడగు ప్రసేనుడు విలాసముగా ఆ మణిని ధరించి వేటకై అడవికి వెళ్ళినాడు. అది ఆతనికి నాశనహేతువైనది. ఆ మణిని చూచి మాంసఖండమని భ్రమించిన సింహమొకటి అతడిని వెంటాడి చంపి మణిని నోటకరచుకొని పోయినది. నిజము తెలియని సత్రాజిత్తు మణి ప్రలోభముతో శ్రీకృష్ణుడే తన తమ్ముని చంపి అపహరించాడని అనుమానించి నిందపాలు చేసాడు.ఆ నింద బాపుకొనుట శ్రీకృష్ణునికి ఆవశ్యకమైనది.
అడవిలో అన్వేషణ సాగించినాడు. ఒకచోట ప్రసేనుని కళేబరము కనిపించినది. అచట కనిపించిన సింహపు కాలిజాడల వెంట సాగి వెళ్ళాడు. ఒక ప్రదేశమున సింహము, భల్లూకం పోరాడిన జాడలు కనిపించాయి. శ్రీకృష్ణుడు భల్లూకపు కాలిజాడల వెంట వెళ్ళాడు. అవి ఒక గుహలోకి వెళ్ళాయి. గుహలో ఒక బాలునికి ఉన్న ఊయల తొట్టికి మణి వేలాడగట్టబడి ఉన్నది. శ్రీకృష్ణుడు ఆ మణిని అందుకున్నాడు. ఇంతలో భయంకరముగా అరచుచు ఒక భల్లూకం అతనిపై బడింది. భీకర సమరం సాగింది ఒక దినము కాదు, రెండు దినములు కాదు, ఇరువది ఎనిమిది దినములు. క్రమంగా ఆ భల్లూకమునకు శక్తి క్షీణించజొచ్చింది.
అది సామాన్య భల్లూకము కాదు. మహాభక్తుడు శక్తివంతుడైన జాంబవంతుడు. రామాయణ కాలమునాటి ఆ జాంబవంతుడు కర్మబంధములు విడివడక నిలిచియున్నాడు. అజేయుడాతడు. ఎవరివల్లను అతడు క్షీణబలుడగు ప్రశ్నేలేదు. ఒక్క శ్రీరామచంద్రుని వల్లనే అది సాధ్యము. ఈ విషయము తెలిసిన జాంబవంతుడు తాను ఇన్ని దినములు పోరాడుతున్నది శ్రీరామచంద్రునితోనేనని గుర్తించిస్తోత్రము చేయనారంభించినాడు.
అది త్రేతాయుగపు గాథ. ఇది ద్వాపరయుగము. ఆ యవతారములో జాంబవంతుని సేవలకు మెచ్చిన శ్రీరామచంద్రుడు ఒక వరము కోరుకొమ్మనగా అవివేకముతో జాంబవంతుడు స్వయముగా శ్రీరామచంద్రునితో ద్వంద్వ యుద్ధమును కోరినాడు. అది శ్రీరామ కార్యము గాదు కాన అప్పుడు నెరవేరలేదు. అవివేకముతో అతడు కోరిన కోరిక జాంబవంతునకు దీర్ఘకాల కర్మబంధమయినది. ఇప్పుడు కర్మ పరిపక్వమయినది. నేడీ రూపమున ఆ ద్వంద్వ యుద్ధము సంఘటిల్లినది. అవివేకము వైదొలగినది. అహంభావము నశించింది. శరీరము శిథిలమయింది. జీవితేచ్ఛనశించింది. శ్రీకృష్ణ పరమాత్మ రూపమున తనను అనుగ్రహించ వచ్చినది ఆ శ్రీరామచంద్ర ప్రభువేనని గ్రహించి ప్రణమిల్లి ఆ మణిని, ఆ మణీతో పాటు తన కుమార్తె జాంబవతిని అప్పగించి కర్మబంధ విముక్తి పొందాడు జాంబవంతుడు.
శ్రీకృష్ణుడు మణిని తీసుకుని నగరమునకు వెళ్ళి పురజనులను రావించి జరిగిన యధార్థమును వివరించి నిందబాపుకున్నాడు. నిజము తెలిసిన సత్రాజిత్తు కూడా పశ్చాత్తాపము చెంది మణిని, తన కుమార్తెయగు సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి వివాహము చేశాడు. ధర్మజ్ఞుడగు శ్రీకృష్ణుడు మణిని నిరాకరించి సత్యభామను స్వీకరించాడు.వినాయక వ్రతము చేయక చంద్రబింబమును చూచుట వలన జరుగు విపరీతమును స్వయముగా అనుభచించిన శ్రీకృష్ణపరమాత్మ లోకుల యెడల పరమదయాళువై భాద్రపద శుద్ధ చవితినాడు వినాయకుని యథాశక్తి పూజించి ఈ శ్యమంతకమణి కథను అనగా అందలి హితబోధను చెప్పుకొని, గణేశతత్వము పట్ల భక్తి వినయములతో శిరమున అక్షింతలు ధరించిన యెడల నాడు చంద్రదర్శనము చేసినను నిష్కారణ నిందా భయముండదని లోకులకు వరము ఇచ్చినాడు. అది మొదలు మనకు శ్యమంతకమణి గాథను వినుట సాంప్రదాయమయినది.
పూజచేసి కథనంతయు విను అవకాశము లేనివారు...
సింహ: ప్రసేనమవధీత్ సింహో జాంబవతా హతాః
ఇతి బాలక మారోద తవ హ్యేషశ్యమంతకః
సింహముప్రసేనుని చంపినది. ఆసింహమును జాంబవంతుడు చంపెను. కనుక ఓ బిడ్డా ఏడువకు. ఈ శ్యమంతకము నీదే అను అర్థము గల పై శ్లోకమునైనా పఠించుట ద్వారా ఆ విషయము స్మరించదగియున్నదని చెప్పబడినది. ఇది జాంబవంతుని గుహలో ఊయలలోని బిడ్డను లాలించుతూ పాడిన పాట అని చెప్పబడినది.
సర్వేజనాః సుఖినో భవంతు