జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 11 నుండి 19వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. మే 10వ తేదీన అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు వాహనసేవలు జరుగనున్నాయి. మే 20వ తేదీన సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు
- 11-05-2025: ఉదయం – ధ్వజారోహణం (ఉదయం 8.15 నుండి 9 గంటల వరకు), రాత్రి – పెద్దశేష వాహనం
- 12-05-2025: ఉదయం – చిన్నశేష వాహనం, రాత్రి – హంస వాహనం
- 13-05-2025: ఉదయం – ముత్యపుపందిరి వాహనం, రాత్రి – సింహ వాహనం
- 14-05-2025: ఉదయం – కల్పవృక్ష వాహనం, రాత్రి – హనుమంత వాహనం
- 15-05-2025: ఉదయం – పల్లకీ ఉత్సవం, రాత్రి – గరుడ వాహనం
- 16-05-2025: ఉదయం – సర్వభూపాల వాహనం, రాత్రి – కల్యాణోత్సవం (సాయంత్రం 6 గంటలకు),
- గజ వాహనం (రాత్రి 8 గంటలకు)
- 17-05-2025: ఉదయం – రథోత్సవం, రాత్రి – అశ్వవాహనం
- 18-05-2025: ఉదయం – సూర్యప్రభ వాహనం, రాత్రి – చంద్రప్రభ వాహనం
- 19-05-2025: ఉదయం – చక్రస్నానం (ఉదయం 9 గంటలకు), రాత్రి – ధ్వజావరోహణం
మే 16వ తేదీ సాయంత్రం 6 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. రూ.300/- చెల్లించి గృహస్తులు ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక అప్పం, అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు.
ఈ సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తి సంగీత కార్యక్రమం, హరికథాగానం, కోలాటాలు తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.